ముందే ఎండాకాలం, మండే ఎండలు
- బీడువారిన పొలాలు,
త్రాగేందుకు గుక్కెడె
నీళ్ళులేవు` కూలపడేందుకు నిట్ట నీడలేదు. అన్ని ఎండినాయి. ఆశలన్ని వీగినాయి. ఆత్మహత్యలే శరణ్యమని అనేకమంది
రైతులు, పశువులు ఆహుతులౌతుపోసాగాయి. కాని అనుకోని దృశ్యం
ఆశ్చర్యానికి గురిచేసింది. ‘అనేక గుడారాలు’
యాత్ర - జాతర సంబరవేళల్లో కానవచ్చే ఆర్భాటం ఇక్కడ నిశ్శబ్ద
బ్రతుకుపోరాటం `రక్షణ` సంరక్షణ ఆరాటం కనిపించింది. మరాఠ్వాడా ప్రాంతంలో ప్రస్తుతం భగ - భగ మండే ఈ ఎండకాలంలో పశుసంరక్షణ శిబిరాలు అనేకం వెలిసాయి. దానికి మరాఠ్వాడ ప్రభుత్వం
అండగా వచ్చింది. తమ పశువుల్ని పోషించలేనివారు వాటిని తీసుకొచ్చి పశు సంరక్షణ
కేంద్రాల్లో ఉంచొచ్చు. వాటి బాగోగులు చూస్తు తాము
ఉండొచ్చు. వానలు పడేదాక
ప్రభుత్వమే ప్రతిరోజు వారికోసం పశుగ్రాసం`మంచినీరు` అవసరం మేరకు
సరుకులు ఉచితంగా
అందిస్తూ వాటి పాలనా - పోషణ జాగ్రత్తలు చూసుకోమంటుంది. ‘పశుసంరక్షణ’ కార్యాచరణతో పేద -సాద
రైతులకు పనికి పని,
నీడకు నీడ, చీకట్లో చిరుదివ్వే వెలుగులా బ్రతుకుకు అండ, గాభరపడిన గొంతుకు గుక్కెడు నీళ్ళు, కడుపులో కాసీంత గంజీ అన్నం ఆసరాగా
అందించబడ్డది. ఆవు -పశుగ్రాసం
ప్రభుత్వమే అందించినా, పశువుల పేడ, పాలు, పెరుగు, నెయ్యి తయ్యారి చేసుకొని దగ్గరిగ్రామాలో
- పట్టణాలో విరివిగా మరి
బేరమాడి విక్రయించి నాలుగాణాలు కూడబెట్టుకోగలుగుతున్నారు. ఉచితం ఉచితం కరువుసాయం అని చెప్పి
గత ప్రభుత్వాలు కొండంత చూపి,
గోరంత ఇచ్చి ఉన్నాం
- లేనిదంతయు తమ` తమ బ్యాంకు ఖాతాల్లో` స్వార్థానికే స్వాహా చేసుకున్నారే తప్ప.. ఈ
ప్రభుత్వం పశువులకు ఆసరా మా బ్రతుకులకు సహరా కల్పించి మాకు పని కల్పించారు. గో ఆధారిత
గ్రామం ఎన్నటికి ఎప్పటికి క్షేమమేకాని క్షామము కాదని
నిరూపించగలిగారు.